దారుణం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

టుంబ తగాదాలతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Update: 2024-06-28 16:05 GMT

దిశ,శంషాబాద్ : కుటుంబ తగాదాలతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్బీ నగర్ లో చోటుచేసుకుంది. ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన సోమశేఖర్ అతని భార్య ప్రియాంక వారి ఇద్దరి పిల్లలు అద్విక్, ఆరాధ్యలతో గత కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్.బి నగర్ కాలనీలో భర్త ప్రైవేటు జాబ్ చేసుకుంటూ జీవిస్తున్నారు. శుక్రవారం భర్త సోమశేఖర్ పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వచ్చిన క్రమంలో ఇంట్లో నుంచి డోర్ పెట్టి ఉండడంతో ఎంత డోర్ కొట్టినా తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టాడు.

చూసే సరికి అప్పటికే భార్య ప్రియాంక (26) ఉరి వేసుకుని మృతి చెంది ఉంది. ఇద్దరు పిల్లల (కొడుకు అద్వీక్ (3),ఆరాధ్యా (7 నెలలు) ) పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన ప్రియాంక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి,ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు కుటుంబ కలహాలేనా ..మరే మైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.

Similar News