భారత్ గురించి చైనాపై అమెరికా ఆగ్రహం

by  |
భారత్ గురించి చైనాపై అమెరికా ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: చైనాపై అమెరికా మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహించింది. చైనాది దుందుడుకు చర్య అని అభివర్ణించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మీడియా మాట్లాడుతూ.. చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూటాన్ భూభాగంపై చైనా వాదన సరికాదన్నారు.

చైనా ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలన్నారు. భారత్ భూభాగంలోకి చొచ్చుకు రావడం సరికాదన్నారు. చైనా ఇలాగే చేస్తే తగిన పాఠం చెప్పక తప్పదన్నారు. కాగా, ఇప్పటికే కరోనా విషయమై చైనాపై అమెరికా తీవ్ర కోపంగా ఉన్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed