111 ఏళ్ల ‘అల్లూరి’అనుచరుడు కన్నుమూత

by Anukaran |
111 ఏళ్ల ‘అల్లూరి’అనుచరుడు కన్నుమూత
X

దిశ, ఏపీబ్యూరో : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరుడు బీరు బోయిన బాలుదొర(111) ఆదివారం కన్నుమూశారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామం. బాలుదొర గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు.

ఎత్తైన కొండలపై ఉన్న అల్లూరికి, ఆయన ముఖ్య అనుచరులకు ఆహారం అందించినట్లు పలు సందర్భాల్లో గుర్తు చేసుకునే వారని స్థానికులు పేర్కొన్నారు. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్త గురించి తెలిసి చుట్టుపక్కల ప్రజలు నివాళులర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చారు. బాలుదొర మరణానికి అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు సంతాపం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed