ఇరాక్‌లోని యుఎస్ ఎంబసీ లక్ష్యంగా రాకెట్ దాడులు

by vinod kumar |
ఇరాక్‌లోని యుఎస్ ఎంబసీ లక్ష్యంగా రాకెట్ దాడులు
X

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగినట్లు అమెరికా సైనిక వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బాగ్దాద్‌లోని యుఎస్ ఎంబసీ ఉన్న గ్రీన్‌జోన్, హై సెక్యూరిటీ ప్రాంతంలో రాకెట్లు విరుచుకుపడినట్లు అక్కడి పశ్చాత్య దౌత్య‌వేత్త ఒకరు తెలిపారు. ఇరాక్‌లోని అమెరికా బలగాలే లక్ష్యంగా అక్టోబర్ నుంచి జరిగిన దాడుల్లో ఇది 19వ దాడి.

Advertisement

Next Story

Most Viewed