కొడుకుని దారుణంగా చంపేసిన తండ్రి 

by  |
కొడుకుని దారుణంగా చంపేసిన తండ్రి 
X

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, పస్తాల గ్రామంలో దారుణం జరిగింది. కన్న కొడుకును కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. స్థానిక సమాచారం ప్రకారం… పస్తాల గ్రామానికి చెందిన బండగొర్ల ఈదప్ప(63), బండగొర్ల శ్రీశైలం(40) తండ్రీ కొడుకులు.

తండ్రీకొడుకులు తరచూ గొడవ పడుతుండేవారు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి 9 గం.ల సమయంలో తండ్రీకొడుకులు వీధిలోనే గొడవ పడ్డారు. ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో తండ్రిని వెనకనుంచి తన్నాడు కొడుకు శ్రీశైలం.

కోపోద్రిక్తుడైన తండ్రి ఈదప్ప పక్కనే ఉన్న కర్రతో వెనక నుంచి కొడుకు శ్రీశైలం మెడ పైభాగంలోని తలపై దాడి చేశాడు. చిన్న మెదడు దగ్గర గట్టిగా కొట్టడంతో చెవి నుండి రక్తం ధారలాగా వచ్చి అక్కడికక్కడే శ్రీశైలం మరణించాడు.

కొడుకు చనిపోవడంతో తండ్రి ఈదప్ప అక్కడ నుండి పరారయ్యాడు. శ్రీశైలం మరణంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతునికి భార్య సునీత, కూతుళ్లు గౌతమి, పల్లి, కుమారుడు మహేష్ లు ఉన్నారు.

యాదవులకు గొర్రెల పంపిణీ యూనిట్లలో శ్రీశైలం గ్రామ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ఈదప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story

Most Viewed