మౌత్‌వాష్‌ ఆర్డర్ పెడితే స్మార్ట్ ఫోన్ వచ్చింది.. దాన్ని చూసి అతను ఏం చేశాడంటే..?

by Shyam |   ( Updated:2021-05-15 04:45:51.0  )
మౌత్‌వాష్‌ ఆర్డర్ పెడితే స్మార్ట్ ఫోన్ వచ్చింది.. దాన్ని చూసి అతను ఏం చేశాడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం అందరూ ఇంటర్నెట్ యుగంలో జీవిస్తున్నారు. ఏదీ కావాలన్న ఆన్ లైన్ లో బుక్ చేస్తే చాలు చిటికలో వచ్చేస్తుంది. అయితే కొంత మంది మొబైల్ బుక్ చేస్తే రాళ్లు రావడం కూడా జరిగింది. కానీ ముంబైకి చెంది ఓ వ్యక్తికి అమెజాన్ అదిరిపోయే ఆఫర్, ఊహించని షాక్ ఇచ్చింది. ఏమిటనుకుంటున్నారా.. ముంబైకి చెందిన లోకేష్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో కోల్గేట్ మౌత్‌వాష్‌ కావాలని అమెజాన్ యాప్ ద్వారా ఆర్డర్ చేశారు. అయితే 5 రోజులతర్వాత తనకు అమెజాన్ నుంచి ఓ ప్యాక్ వచ్చింది. ఆర్డర్ చేసిన వ్యక్తి దాన్ని తెరిచి చూసేసరికి 12,500 విలువచేసే రెడ్ మీనోట్ 10 స్మార్ట్ ఫోన్ ఉంది. దీంతో అతను చాలా షాక్ అయ్యారు. నేను రూ.369 విలువచేసే మౌత్ వాష్ కు ఆర్డచేస్తే ఫోన్ రావడం ఏంటీ అని బాక్స్ లో ఉన్న ఇన్వాయిస్ చూశారు. దీంతో అందులో తెలంగాణకు చెందిన వ్యక్తి పేరు, అడ్రస్ ఉంది. దీంతో మెయిల్ ద్వారా కంపెనీని సంప్రదించి జరిగిన విషయం చెప్పాడు. ఆ ప్రొడక్ట్‌ను తన దగ్గర నుంచి తీసుకొని సరైన వ్యక్తికి అందించాలని ఇప్పటికే అమెజాన్ కు మెయిల్‌ కూడా పంపానని లోకేశ్‌ ట్వీట్‌ చేశాడు. అతడి నిజాయితీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story