కిషన్ రెడ్డి కోసం రంగంలోకి కొడుకు తన్మయ్ రెడ్డి.. సికింద్రాబాద్‌లో విస్తృతంగా ప్రచారం

by Disha Web Desk 2 |
కిషన్ రెడ్డి కోసం రంగంలోకి కొడుకు తన్మయ్ రెడ్డి.. సికింద్రాబాద్‌లో విస్తృతంగా ప్రచారం
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నిక రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్‌లు ఈ సెగ్మెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరివారు పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంతవరకు ఎప్పుడూ బయటకు రాని కిషన్ రెడ్డి కొడుకు తన్మయ్ రెడ్డి తండ్రి కోసం రంగంలోకి దిగారు. సెగ్మెంట్ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి నిర్వహించిన ప్రచారంలో భాగంగా తన్మయ్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ హయాంలో ప్రపంచంలోనే భారత్ స్ట్రాంగ్‌గా మారిందని అన్నారు. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ప్రకటించారు. సికింద్రబాద్‌లో నా తండ్రి కిషన్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువతకు కీలక పిలుపు ఇచ్చారు. ‘ఓటు హక్కు అందరి బాధ్యత అని.. యువత తప్పక వినియోగించుకోవాలి’ అని సూచంచారు.

Next Story

Most Viewed