- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
భారత్ సెమీస్కు.. ఆసిస్ చిత్తు
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా సెమీస్కు దూసుకెళ్లింది. సూపర్-8 ఆఖరి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై నెగ్గి సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను 24 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత ఓవర్లలో 205/5 స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(92) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సూర్యకుమార్(31), పాండ్యా(27), దూబె(28) రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన కంగారులను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆసిస్ 181/7 స్కోరుకే పరిమితమైంది. ట్రావిస్ హెడ్(76) పోరాడినా మిగతా వారు విఫలమయ్యారు. అర్ష్దీప్ 3 వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ 2 వికెట్లతో సత్తాచాటాడు. ఓటమితో ఆసిస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. బంగ్లాపై అఫ్గాన్ గెలిస్తే ఆ జట్టు ఇంటిదారిపట్టనుంది.