T20 World Cup 2024 : బెంబేలెత్తించిన బుమ్రా, అర్ష్‌దీప్.. భారత్ చేతిలో అఫ్గాన్ చిత్తు

by Harish |
T20 World Cup 2024 : బెంబేలెత్తించిన బుమ్రా, అర్ష్‌దీప్.. భారత్ చేతిలో అఫ్గాన్ చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ సూపర్-8 రౌండ్‌లో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 47 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 181/8 స్కోరు చేసింది. సూర్యకుమార్(53) మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. పాండ్యా(32) పర్వాలేదనిపించాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫరూఖీ, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన అఫ్ఘాన్‌ నిర్ణీత ఓవర్లలో 134 పరుగులు చేసిన ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. బుమ్రా(3/7) నిప్పులు చెరగగా.. అతనికి అర్ష్‌దీప్ సింగ్(3/36), కుల్దీప్ యాదవ్(2/32) తోడవడంతో ప్రత్యర్థి కుప్పకూలింది.

Advertisement

Next Story