- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
భారత్ వర్సెస్ పాక్.. అంచనాలు పెంచేసిన పాండ్యా
దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం దాయాదుల పోరు జరగనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఆ అంచనాలను మరింత పెంచేశాడు టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. పాక్తో మ్యాచ్లో జట్టుగా ఆడి వేటాడుతామని వ్యాఖ్యానించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్తో పాండ్యా మాట్లాడుతూ.. పెద్ద మ్యాచ్లు ఆడటం ఉత్తేజంగా ఉంటుందని, పాక్తో మ్యాచ్ తనకు మరింత స్పెషల్ అని చెప్పాడు.
‘భారత్, పాక్ మ్యాచ్లు ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటాయి. అందరినీ ఊపరిబిగపట్టి ఉండాలని అభ్యర్థిస్తున్నా. ఈ మ్యాచ్ పోరాటం కాదు.. చరిత్ర అవుతుంది. పాక్తో మ్యాచ్ అంటే చాలా అంచనాలు ఉంటాయి. భావోద్వేగంతో కూడి ఉంటుంది. ఆ మ్యాచ్లో క్రమశిక్షణతో ఆడతాం. జట్టుగా ఆడి వేటాడుతాం. అదే జరిగితే అంతకంటే గొప్ప రోజు మరొకటి ఉండదు.’అని చెప్పుకొచ్చాడు. కాగా, గత టీ20 వరల్డ్ కప్లో పాక్పై విజయంలో పాండ్యా(40) కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ(82 నాటౌట్)తో కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పాండ్యా అవుటైనా కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. టీ20ల్లో పాక్పై పాండ్యాకు బౌలింగ్ పరంగా మంచి రికార్డు ఉంది. ఆరు మ్యాచ్ల్లో 7.5 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు.