భార్యను ఎత్తుకెళ్లి యువకుడు సహజీవనం.. స్నేహితులతో కలిసి భర్త ఏం చేశాడో తెలుసా..?

by Rajesh |
భార్యను ఎత్తుకెళ్లి యువకుడు సహజీవనం.. స్నేహితులతో కలిసి భర్త ఏం చేశాడో తెలుసా..?
X

దిశ, హుజురాబాద్ రూరల్ : భార్యను ఎత్తుకెళ్లిన యువకుడిపై భర్త తన స్నేహితులతో కలిసి వచ్చి కారులో కిడ్నాప్ చేసి దాడి చేసిన సంఘటన గురువారం హుజరాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన సతీష్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన ధనుష్ అనే యువకుని ప్రేమలో సదరు వివాహిత పడింది. అతనితో కలిసి గత సంవత్సరం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. సంవత్సరం నుండి సతీష్ తన భార్య కోసం బంధువులు, స్నేహితుల సహకారంతో వెతుకుతున్నాడు. ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం నుండి హుజురాబాద్ లో తన భార్య ధనుష్ అనే యువకునితో కలిసి ఉంటుందని తెలుసుకున్నాడు.

గురువారం రోజు తన ఇద్దరు స్నేహితులను తీసుకొని కారులో హుజురాబాద్‌కు వచ్చాడు. ధనుష్ నివాసం ఉండే మార్కెట్ ఏరియాకు చేరుకుని చేపల మార్కెట్ ఏరియాలో కనబడ్డ ధనుష్ ను కారుతో గుద్ది.. కారులోకి బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేసుకొని తీసుకువెళ్లారు. అనంతరం హుజురాబాద్ సమీపంలోని కేసీ కెనాల్ వద్దకు తీసుకెళ్లి దాడి చేశారు. కారులో ఎత్తుకెళుతున్న సమయంలో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సినీ ఫక్కీలో కారును చేధించి పట్టుకున్నారు. అప్పటికే ధనుష్ వారి బారి నుండి తప్పించుకున్నాడు. అయితే ధనుష్ తప్పించుకున్నాడా..? లేదా వీరే ఏమైనా చేశారా..అనే అనుమానాలున్నాయి. పోలీసులు కారును, సతీష్ తో పాటు ఇద్దరు స్నేహితులను భార్యను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను, మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. కారు ను సీజ్ చేసినట్లు సీఐ బొల్లం రమేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed