దారుణం.. ప్రియురాలి తండ్రిని కిరాతకంగా చంపిన యువకుడు

by Rajesh |
దారుణం.. ప్రియురాలి తండ్రిని కిరాతకంగా చంపిన యువకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియురాలి తండ్రిని యువకుడు కిరాతకంగా కత్తితో పొడిచి చంపడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఏపీ విజయవాడలోని బృందవాన్ కాలనీలో చోటు చేసుకుంది. వ్యాపారి కుమార్తెను యువకుడు ప్రేమిస్తున్నట్లు తెలిసింది. కాగా యువతి తండ్రి యువకుడిని మందలించడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారి కుమార్తె ఇంజినీరింగ్ సెంకండ్ ఇయర్ చదువుతుండగా, ఓ పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడు(పీఈటీ)గా శివమణికంఠ పనిచేస్తున్నాడు. వీరిద్దరికి ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. నాలుగేళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉండగా తండ్రి రామచంద్ర ప్రసాద్‌కు విషయం తెలిసింది. శివమణికంఠను యువతి తండ్రి మందలించినట్లు సమాచారం. తండ్రికి విషయం తెలియడంతో యువతి యువకుడిని దూరం పెడుతూ వస్తోంది.

పెళ్లి ప్రతిపాదనను సైతం తిరస్కరించినట్లు తెలిసింది. ఇదే విషయమై శివ మణికంఠ ఇంట్లో గొడలు స్టార్ట్ కాగా.. యువకుడి తల్లి ఇటీవల ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో యువకుడు యువతి తండ్రిపై పగ పెంచుకున్నాడు. శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెతో కలిసి కిరాణషాపునకు రాగా.. రాత్రి 9 గంటలకు షాపు మూసి ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో షాపునకు కొద్ది దూరంలోనే కాపుకాసిన మణికంఠ తండ్రీ కూతుళ్లు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తన బైక్‌తో ఢీకొట్టాడు. వారు కిందపడిపోగా యువతి తండ్రిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు రామచంద్రప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మణికంఠను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed