Road Accident:ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

by Jakkula Mamatha |
Road Accident:ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
X

దిశ,నందికొట్కూరు:నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామ పరిధిలో పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు.శుక్రవారం ఆర్టీసీ బస్సు ప్రమాదంలో నందికొట్కూరు మండలం శాతన కోటకు చెందిన బోయ హరికృష్ణ( 28) టి.వీరన్న( 30) మృతి చెందారు. మృతులు కర్నూలు నుంచి ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా నందికొట్కూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న ఏపీ 21 జెడ్ 0840 నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు బ్రాహ్మణ కొట్కూరు పెట్రోల్ బంక్ వద్ద ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై నాగార్జున ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed