విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి....మరో ఆరుగురికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 15 |
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి....మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, చింతపల్లి : విద్యుత్ షాక్ కు గురై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుర్మేడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని హైదరాబాద్... నాగార్జునసాగర్ రహదారి పక్కన భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న హెవెన్లీ హ్యాంగర్ అనే షాపింగ్ మాల్​లో బుధవారం ఉదయం నుండి విద్యుత్ కు సంబంధించిన పనులు చేపడుతున్నారు. ఇటీవల ఆ బిల్డింగ్ లో ఒక హోటల్ ని నడిపి అనివార్య కారణాల వల్ల మూసి వేశారు. ప్రస్తుతం ఆ బిల్డింగ్ లో హెవెన్లీ హ్యాంగర్ అనే షాపింగ్ మాల్​ను ఏర్పాటు చేస్తున్నారు.

భవనం పైన నేమ్ బోర్డు ఏర్పాటు చేసేందుకు ఆరుగురు కార్మికులతో పాటు ఒక ఎలక్ట్రిషన్ పనులు నిర్వర్తిస్తున్నాడు. పనులు జరిగే సమయంలో 11 కేవీ ట్రాన్స్​ఫారం నుండి ఎల్సీ తీసుకోకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. మృతుడు ఒక్కసారిగా విద్యుత్ షాష్​కు గురై కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే అదే సమయంలో నేమ్ బోర్డును పట్టుకున్న మరో ఆరుగురి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం కింద పడిపోయిన వ్యక్తిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు ఒంగోలు జిల్లాకు చెందినవాడిగా స్థానికులు చెప్తున్నారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై విద్యుత్ అధికారులను సంప్రదించగా ఎలాంటి ఫోన్ సమాచారం లేదు.

Next Story

Most Viewed