మంగళహాట్ లో మర్డర్

by Sridhar Babu |
మంగళహాట్ లో మర్డర్
X

దిశ,కార్వాన్ : ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... సీతారాం బాగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ తాజా ముల్ అహ్మద్ (46) గురువారం రాత్రి పడుకొని శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి తలపై బలమైన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారా, లేక రాడుతో దాడి చేశారా అని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story