తేనెటీగల దాడిలో పరుగెత్తుతుండగా వ్యక్తికి హార్ట్ ఎటాక్

by Disha Web Desk 11 |
తేనెటీగల దాడిలో పరుగెత్తుతుండగా వ్యక్తికి హార్ట్ ఎటాక్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఒక యువకుడు తేనె టీగల దాడిలో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం తమ సొంత వ్యవసాయ పొలంలో విస్లావత్ తారక్ (23) అనే యువకుడు ట్రాక్టర్ ద్వారా భూమిని చదును చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో వాటి నుంచి రక్షించుకునేందుకు కేకలు వేస్తూ కొంత దూరం పరుగులు తీశాడని, ఆ క్రమంలోనే స్పృహ తప్పి ఊపిరాడక పడిపోయాడని బంధువులు తెలిపారు. ప్రైవేటు వాహనం ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతించాడని ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యులు తేల్చి చెప్పారన్నారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story

Most Viewed