‘ఆ అమ్మాయికి చాలా మందితో సంబంధాలున్నాయి..’ బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య సంచలన కామెంట్స్

by karthikeya |
‘ఆ అమ్మాయికి చాలా మందితో సంబంధాలున్నాయి..’ బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జానీపై ఏకంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు జానీ మాస్టర్‌ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. ఇలాంటి టైంలో బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య ఆయేషా సంచలన ఆరోపణలు చేశారు. జానీ మాస్టర్‌పై పెట్టిన కేసులన్నీ ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక దెబ్బతీయడానికి పెట్టినవేనని, ఆయనపై వస్తున్న ఆరోపణలన్నీ వట్టి అబద్ధాలని కొట్టిపారేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయేషా జానీ మాస్టర్‌పై ఇన్ని ఆరోపణలు చేస్తున్న ఆ అమ్మాయి ఇప్పటివరకు ఒక్క ప్రూఫ్ కూడా చూపించకపోవడం ఏంటని ప్రశ్నించారు. మైనర్‌గా ఉన్నప్పుడే జానీమాస్టర్ తనపై అత్యాచారం చేశాడని చెబుతోందని, అలా అయితే ఇంటర్వ్యూల్లో ‘జానీ మాస్టర్‌తో పని చేయడం నా అదృష్టం’ అని ఆనందంగా ఎలా చెప్పిందని నిలదీశారు. అంతేకాకుండా జానీ మాస్టర్ దగ్గరికి రావడానికి ముందు నుంచే ఆ అమ్మాయి ఢీ షోలో చేసిందని, అక్కడి నుంచే ఆమెకి ఎంతోమందితో సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఆ అమ్మాయికి ఆమె తల్లే వేరేవాళ్లతో తిరగమని సలహాలు ఇచ్చేదని, పొట్టి బట్టలు కట్టుకోమని చెప్పేదని, కానీ మాస్టర్ మాత్రం దానికి ఒప్పుకోలేదని ఆయేషా చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed