‘ఓవైసీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు..’ కేంద్రం మంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

by karthikeya |
‘ఓవైసీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు..’ కేంద్రం మంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని, ఎంఐఎం, ఓవైసీ కుటుంబం పర్మిషన్‌తోనే ఓల్డ్ సిటీ ఉగ్రవాదుల (Terrorists)కు అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన కామెంట్స్ చేశారు. ఓల్డ్ సిటీని రోహింగ్యా (Rohingya)లకు, టెర్రరిస్ట్‌లకు అడ్డాగా మార్చారంటూ ఓవైసీపై విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడ టెర్రరిస్టులు పట్టుబడ్డా వారిలో కచ్చితంగా ఒక్కరికైనా ఓల్డ్ సీటీతో లింకులు ఉంటాయని ఆరోపించారు.

కాగా.. బండి సంజయ్‌కి ఇస్లామోఫోబియా (Islamophobia) పట్టుకుందని, అందుకే మదర్సా (Madarsa)లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ శనివారం నాడు ఎంఐఎం పార్టీ (MIM) మీటింగ్‌లో ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నేడు (ఆదివారం) కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్.. తనకు ఇస్లామోఫోబియా ఉందని ఓవైసీ అంటున్నాడని, అయితే 15 నిముషాల్లో అందరినీ నరికి చంపేస్తాను అన్నోడికి హిందూఫోబియా (Hinduphobia) ఉందా..? అని ప్రశ్నించారు. ఓవైసీ కానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఏనాడూ వందేమాతరం (Vandemataram) ఆలపించలేదని, అలాంటివారికి ఏం ఫోబియా ఉందో చెప్పాలని ప్రశ్నించారు. హిందువులందరూ సెక్యులర్లం అని గొప్పగా చెప్పుకుంటూ పీర్ల పండగ చేసుకుంటారని, కానీ ఓవైసీ ఎప్పుడైనా వినాయకచవితి, దసరా ఉత్సవాలు చేసుకున్నారా..? బొట్టు పెట్టుకుని హిందూ దేవుళ్లకి దండం పెట్టారా..? అని ప్రశ్నించారు.

మదర్సాల గురించి తాను మాట్లాడితే ఓవైసీ తెగ బాధపడ్డాడని, అయితే ప్రపంచం మొత్తం బ్యాన్ చేసిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌ లీడర్‌గా పని చేస్తున్న ఓ టెర్రరిస్ట్ ఓవైసీ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ దొరికాడని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని బిజ్‌నోర్ మదర్సాలో 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి దగ్గరి నుంచి ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. అలాంటప్పుడు మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేస్తున్నాయని అనడంలో తప్పేంటని ప్రశ్నించారు.

ఓల్డ్ సిటీ (Old City) ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓల్డ్ సిటీని ప్రక్షాళన చేసి న్యూ సిటీగా మారుస్తామని, అక్కడి ప్రజలను అభ్యున్నతి వైపు నడిపిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఓల్డ్ సిటీలోని ముస్లిం వర్గం కూడా ఎంఐఎం పార్టీని వ్యతిరేకిస్తోందని, ఓవైసీ వల్లే ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారలేకపోతోందని వాళ్ల మతపెద్దలే అంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అందుకే త్వరలో ఓవైసీకి, ఆయన కుటుంబానికి ఓల్డ్ సిటీ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్పి ఓడిస్తారని అన్నారు.


Next Story

Most Viewed