- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Kejriwal: ప్రధాని నాపై కుట్ర పన్నారు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణ
దిశ, నేషనల్ బ్యూరో: తాను అవినీతిపరుడినని నిరూపించేందుకు ప్రధాని మోడీ కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎంతో ప్రయత్నించారని విమర్శించారు. సీబీఐ, ఈడీ చేసిన అవినీతి ఆరోపణలతో బాధపడి సీఎం పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. ఢిల్లీలోని జంతర్మంతర్లో ఆదివారం జరిగిన ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘గత పదేళ్లుగా ప్రభుత్వాన్ని నిజాయితీగా నడుపుతున్నాం. కరెంటు, నీళ్ల కొరత లేకుండా చేశాం. ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాం. విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాం. దీంతో ఆప్పై గెలవాలంటే దాడి చేయాల్సిందేనని మోడీ ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆప్ సీనియర్ నేతలంగా నిజాయితీ లేని వారని నిరూపించడానికి ప్రతి నాయకుడిని జైలులో పెట్టడానికి కుట్ర పన్నారు’ అని వ్యాఖ్యానించారు.
అవినీతికి పాల్పడి సీఎం కుర్చీలో కూర్చోవడానికి రాజకీయాల్లోకి రాలేదని అందుకే రాజీనామా చేశానని వెల్లడించారు. డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, దేశాన్ని మార్చేందుకు మాత్రమే పాలిటిక్స్లోకి వచ్చానని తెలిపారు. నా చర్మం మందంగా లేదని, నన్ను అవినీతిపరుడు అన్నందుకు ఎంతో బాధపడ్డానని చెప్పారు. త్వరలోనే సీఎం కార్యాలయాన్ని సైతం ఖాళీ చేస్తానని ప్రకటించారు. నాకు ఢిల్లీలో ఇల్లు కూడా లేదని, పదేళ్లలో కేవలం ప్రేమను మాత్రమే సంపాదించానని చెప్పారు. కాగా, ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కేజ్రీవాల్ ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.