గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కు పాదం.. భారీ మొత్తంలో గంజాయి సీజ్

by Aamani |
గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కు పాదం.. భారీ మొత్తంలో గంజాయి సీజ్
X

దిశ,జహీరాబాద్: జహీరాబాద్ పోలీసులు , టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో రూ.35 లక్షల విలువైన 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ. చెన్నూరి రూపేష్ చెప్పారు. గంజాయిని తరలిస్తున్న కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా, బల్కి తాలూకాలోని శంషాపూర్ వాడి గ్రామానికి చెందిన లఖన్ (29), బాల్కి లోని బసవేశ్వర్ చౌక్ బీర్ దేవ్ గల్లీ వాసి సిద్దిరామ్(28) ఇద్దరిని డిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి స్మగ్లింగ్ వివరాలు వెల్లడించారు..తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్న 140 కిలోల ఎండు గంజాయితో పాటు ఇద్దరు స్మగ్లర్లు, మహీంద్రా బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం , రెండు సెల్ ఫోన్ లు నాలుగు సిమ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చిరాగ్ పల్లి ఎస్ఐ.రాజేందర్ రెడ్డి, తన సిబ్బంది , సిసియస్ సిబ్బందితో కలిసి చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాడ్గ క్రాస్ లోని ఆనంద్ దాబా ముందు ఎన్.హెచ్-65 రోడ్ పై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్ర బోలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, ఆ వాహనం ట్రాలి పై బ్లూ కలర్ పాలిథిన్ కవర్ కప్పి ఉన్నది. వాహనాన్ని ఆపి అందు అందులోని ఇద్దరు వ్యక్తులను కిందకు దించి విచారించారు.

బోలెరో వాహనాన్ని కుణ్ణంగా తనిఖీ చేయగా ట్రాలీ క్రింది భాగంలో ప్రత్యేకంగా గంజాయి స్మగ్లింకు అనుకూలంగా చెక్కలను ఏర్పాటు చేసి దాని క్రింద 140 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం సరుకును స్వాధీనం చేసుకుని, వాహనంలోని లఖన్, సిద్ది రామ్ లను అరెస్టు చేశారు. స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల ఆరా తీయగా.. మరిన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడైయ్యాయన్నారు. బాల్కీకి చెందిన మల్లు గొండ అనే నేర ప్రవృత్తి గల వ్యక్తని , నిషేదిత ఎండు గంజాయి ఓడిశా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి రాహుల్ అనే వ్యక్తి ద్వారా ఎండు గంజాయి సేకరించాడు.

ఈ గంజాయిని బాల్కికి చెందిన లఖన్, సిద్ధిరామ్, సునీల్, కిరణ్ , మల్లేష్ నాయక్ ల ద్వారా ఎవరికి తెలియకుండా కార్లలో బోలెరో వాహనాలలో తీసుకువచ్చి మల్లుగొండకు అప్పగించారు. ఆయన ఈ గంజాయిని మహారాష్ట్రలోని ముంబై, పుణె, లాతూర్ లోని వివిద పెద్ద పట్టణాలకు తరలించి ఎక్కువ ధరకు అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తాడని సరుకులతో పాటు అరెస్టు చేసిన లఖన్ , సిద్దిరామ్ లు తెలిపారన్నారు. మిగతా వ్యక్తులు మల్గొండ, రాహుల్, కిరణ్, సునీల్, మల్లేష్ , నాయక్ లు పరారీలో ఉన్నారన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ తోపాటు డీఎస్పీ.కే. రామ్ మోహన్ రెడ్డి , సీఐ.శివలింగం, ఎస్బి-2 రమేశ్ ఇన్స్పెక్టర్ , విజయ్( ఇన్స్పెక్టర్ స్పెషల్ బ్రాంచ్), సీసీఎస్ సీఐ.మహేష్ , చిరగ పల్లి సీఐ. కె. రాజేందర్ రెడ్డి , సీసీఎస్ ఎస్ఐ.శ్రీకాంత్ , ఏఎస్ఐ. మాణిక్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సంగారెడ్డి, రెఖ్య , ఇతర స్టాఫ్ పాల్గొన్నారు. ఈ విషయం లో జిల్లా ఎస్పీ. చెన్నూరి రూపేష్ సిబ్బంది అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed