భారీగా గంజాయి స్వాధీనం

by Sridhar Babu |
భారీగా గంజాయి స్వాధీనం
X

దిశ, జూలూరుపాడు : వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 246 కేజీల గంజాయిని ఆదివారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో జూలూరుపాడు పోలీసులు, టాస్క్ ఫోర్ సిబ్బంది కలిసి పట్టుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. సారపాక మండలం తాళ్లగొమ్మూరు గ్రామానికి చెందిన దుగ్గెంపూడి శివ శంకర్ రెడ్డి, సారపాక మసీదు బజారుకు చెందిన నాగేంద్రబాబులు కలిసి 246 కేజీల గంజాయిని కొనుగోలు చేసి వాహనంలో సారపాక నుంచి ఖమ్మం వైపు తరలిస్తున్నారు.

నమ్మ దగ్గ సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలో గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 87 లక్షలు చేస్తుందన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రెండు వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాణా ప్రతాప్, టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రవీణ్, సిబ్బంది దయానంద్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed