- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ట్రెస్ పాస్ కేసులో మాజీ కార్పొరేటర్ అనుచరులు బైండోవర్
దిశ, పేట్బషీరాబాద్: ఓ ప్రైవేటు స్థలంలో అక్రమంగా ప్రవేశించి కాంపౌండ్ వాల్ను ధ్వంసం చేసిన కేసులో మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీష్ అనుచరులను పోలీసులు బైండోవర్ చేశారు. 2023 అక్టోబర్ నెలలో పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25 బై 1 లో ఉన్న మూడు ఎకరాల భూమిలోకి మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ అతని అనుచరులు ప్రవేశించి అక్కడ ఉన్న కాంపౌండ్వాల్తో పాటుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ విషయంపై బాధితుడు గోపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ విషయంపై గురువారం నాడు పోలీసులు మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీ అతని అనుచరులు అయినా యండమూరి దుర్గాప్రసాద్, వై వెంకటేశ్వరరావు, అమర్ జింత అరవింద్, టంకు సోనా సింగ్, మోహన్ సింగ్ రంజిత్ సింగ్ బురాని బచ్చన్ సింగ్ లను అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఒక జెసిబి తో పాటుగా మూడుసార్లు సీట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.