ఐపీఎల్ మ్యాచ్‌లు చూడకపోతే కొంపలేం మునిగిపోవు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్

by Disha Web Desk 7 |
ఐపీఎల్ మ్యాచ్‌లు చూడకపోతే కొంపలేం మునిగిపోవు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్, డైరెక్టర్ వీవీ గోపాలకృష్ణ కాంబినేషన్‌ల వస్తున్న సినిమా ‘కృష్ణమ్మ’. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతీరా రాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఈ నెల 10వ తేదీన థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. కొరటాల శివ ప్రజెంట్ చేస్తున్న ‘క‌ష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకులు రాజమౌళి, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఐపీఎల్ మ్యాచ్‌ల గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వివాదాస్పదంగా మారాయి.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘సత్యదేవ్ చాలా మంచి యాక్టర్. చిన్న చిన్న పాత్రలతో తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈయన.. ఈ రోజు మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ మూవీ చాలా బాగుంటుంది. అందరూ ఫ్యామిలీస్‌తో కలిసి వెళ్లండి. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఓ రెండు మ్యాచులు చూడకపోతే కొంపలేం మునిగిపోవు. ఫస్ట్ షో, సెకండ్ షోలకు వెళ్లి అందరూ ఈ మూవీని సక్సెస్ చెయ్యండి. అంతే కాకుండా క్రికెట్ స్కోర్‌ను మీ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్ కావడంతో.. సినిమాలు కూడా నెల రోజుల్లో ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా?.. అప్పుడు చూస్తాములే అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు. అంతే కాకుండా ఇతరుల ఇష్టాయిష్టాలను కించపరచడం కరెక్ట్ కాదని కొంత మంది ఫైర్ అవుతున్నారు.

Read More..

ఆ డైరెక్టర్‌ని కొట్టిన వాళ్లకు రూ. 10 వేలు ఇస్తా.. దర్శక ధీరుడు రాజమౌళి షాకింగ్ కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed