- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పాము కాటుతో రైతన్న మృతి..
దిశ, నిజాంసాగర్ : పంట పొలంలో పని చేస్తుండగా పాము కాటు వేయడంతో రైతు మృతి చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని గిర్నితండాలో గురువారం చోటుచేసుకుంది. నిజాంసాగర్ ఎస్సై కే.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నగర్ మండలం గిర్ని తండాకు చెందిన కడావత్ శంకర్ (40) అనే రైతు తన పంట పొలంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పనిచేస్తుండగా ఒడ్డుపై గడ్డిలో ఉన్న పాము కాటు వేసింది.
కుటుంబ సభ్యులు శంకర్ ను వెంటనే చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రిలో వైద్యులు పరిశీలించి శంకర్ అప్పటికే మృతి చెంది ఉన్నాడని ధ్రువీకరించారన్నారు. మృతునికి భార్య స్వరూప ముగ్గురు కుమారులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. శంకర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై కే.సుధాకర్ తెలిపారు. పాముకాటుతో శంకర్ మృతి చెందడంతో శంకర్ కుటుంబ సభ్యులు, తండా వాసులు శోక సంద్రంలో మునిగిపోయారు.