డీసీసీబీ బ్యాంక్ ఛైర్మెన్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

by Sumithra |
డీసీసీబీ బ్యాంక్ ఛైర్మెన్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డికి ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివిధ పనుల నిమిత్తం రమేష్ రెడ్డి నిజామాబాద్ నుండి ఆదివారం ఉదయం మాణిక్బండర్, మదనపల్లి మీదుగా భీంగల్ కు వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా తాను ప్రయాణిస్తున్న క్రెటా కారు ఇంజన్ నుండి మంటలు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా వాహనం లోపల ఉన్న రమేష్ రెడ్డికి ఏం చేయాలో పాలు పోలేదు. దీంతో వెంటనే ఆయన డ్రైవర్ గన్మెన్లతో సహా కార్ లో నుంచి దిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Next Story

Most Viewed