మోటార్ సైకిల్ ను ఢీ కొట్టిన ఏఎస్సై.. బాధితునికి తీవ్రగాయాలు..

by Sumithra |
మోటార్ సైకిల్ ను ఢీ కొట్టిన ఏఎస్సై.. బాధితునికి తీవ్రగాయాలు..
X

దిశ, నవీపేట్ : రోడ్డు దాటుతున్న మోటార్ సైకిలిస్ట్ ను ఏఎస్సై కారుతో ఢీ కొట్టడంతో మహంతం గ్రామానికి చెందిన సంగెమ్ రఘుపతికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు మండలంలోని మహంతం గ్రామానికి చెందిన సంగెమ్ రఘుపతి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా మోటార్ సైకిల్ పై రోడ్డు దాటుతున్నాడు. కాగా నిజామాబాద్ నుంచి నవీపేట్ కు వస్తున్న నవీపేట్ ఏఎస్సై గఫుర్ తన కారుతో రఘుపతిని ఢీ కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయినా ఏఎస్సై క్షతగాత్రుడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన పై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు.

Next Story

Most Viewed