మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామ శివారులో గల బుగ్గా రామేశ్వర ఆలయ అటవీ ప్రదేశంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన సాకలి వెంకటి (26)కి సంవత్సరంన్నర క్రితం సిర్గాపూర్ గ్రామానికి చెందిన నాగరాణితో వివాహం అయింది. మద్యానికి బానిసై ప్రతిరోజూ తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు.

గాంధారి మండల కేంద్రంలో డ్రైవర్​గా పని చేసేవాడు. కొన్ని రోజుల క్రితం తన సొంత గ్రామానికి వెళ్లి మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి అతని చెల్లి రాణి తో గాంధారి కి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు. కానీ గాంధారికి రాకపోవటంతో అతని గురించి వెతుకుతుండగా గురువారం బాన్స్వాడకు వెళ్లే రోడ్డు పక్కన బుగ్గ రామేశ్వర ఆలయం పరిసర ప్రాంతంలో అతని బైక్​ కనిపించింది. అక్కడ వెతకగా చెట్టుకు ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. మృతుని తండ్రి హనుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed