Road Accident : రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

by Aamani |
Road Accident : రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
X

దిశ,కొడకండ్ల : మండలంలోని రంగాపురం గ్రామ శివారులో ద్విచక్ర వాహనం ,ఆర్టీసి బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు.గ్రామస్తుల వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన సాయి కిరణ్ (23) , అర్వపల్లి గ్రామానికి చెందిన జయంత్ (22) లు గురువారం రాత్రి స్కూటీ పై తొర్రూరు కు వెళ్తున్నారు. రంగాపురం క్రాస్ దగ్గర అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టారు. తీవ్ర గాయాలు కావడంతో ఇరువురిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయి కిరణ్ మృతి చెందాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story