కూలి పనికి వచ్చిన వ్యక్తి అదృశ్యం..

by Aamani |
కూలి పనికి వచ్చిన వ్యక్తి అదృశ్యం..
X

దిశ,కంది : బతుకుదెరువు కోసం కూలి పనికి వచ్చి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన అంకుష్ (30) కూలికి పని కోసం సంగారెడ్డి పట్టణానికి వచ్చాడు. కాగా ఈ నెల 3వ తేదీన తన తండ్రి అయిన పర్తి కొడుకు అంకుష్ కి ఫోన్ చేసినా స్పందించలేదు. స్థానిక రాజంపేటలో అతడు కిరాయికి ఉంటున్నాడు అని తెలుసుకొని వచ్చి చూడగా అతడి ఆచూకీ తెలిసి రాలేదు. అంకుష్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ 08455-276333, పట్టణ సీఐ 8712656718 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

Advertisement

Next Story