- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
suicide : కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది గృహిణి ఆత్మహత్య
దిశ, కూకట్పల్లి: కుటుంబ సమస్యలతో మనస్థాపం చెందిన ఓ గృహిణి ఇంట్లో అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్బీ ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లోని ఎంఐజీ 33 లో హేమ నందిని(27) సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భర్త శ్రీధర్, తన సోదరుడు మన్నూరు హరిబాబుతో కలిసి నివాసం ఉంటుంది. ఇదిలా ఉండగా ఆషాడ మాసం కావడంతో హేమ నందిని భర్త శ్రీధర్ ఈ నెల 1వ తేదీన తన సొంతూరుకు వెళ్లాడు. దీంతో హేమ నందినితో పాటు ఆమె నానమ్మ ఉంటుంది. రోజు వారి మాదిరిగానే గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత ఎవరి గదిలో వారు నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని ద్రావణం సేవించింది.
హేమ నందిని ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుందని నానమ్మ హరిబాబు కుచెప్పడంతో హుటాహుటిన హేమ నిందిని హైటెక్సిటిలోని యశోధ ఆసుపత్రికి తరలించారు. హేమ నందిని పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు తెలిపారు. హేమ నందిని ఇంట్లో ఉన్న వాస్మల్ కేష్ కాలా నూనే తాగినట్టు వైద్యులు తెలిపారు. సంఘటన సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా కుటుంబ సమస్యలతో మనస్థాపం చెందిన హేమ నందిని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధికి తరలించినట్టు ఎస్సై లింగం తెలిపారు.