కరెంట్ షాక్ తో ఓ బాలుడు మృతి..

by Sumithra |
కరెంట్ షాక్ తో ఓ బాలుడు మృతి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సిరికొండ మండలం కొండాపూర్ సమీపంలోని తాళ్ల తండాలో ఆదివారం రాత్రి విద్యుత్ షాక్ తో బాలుడు మృతి చెందాడు. గిరిజన తండాలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సంజీవ్ (16) అనే బాలుడు ఆదివారం రాత్రి మండపం వద్ద ఉన్న సామాగ్రినంతా సర్దుతుండగా, పక్కనే ఉన్న మైక్ సెట్ ను కూడా ఓ పక్కకు జరిపే ప్రయత్నంలో కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. మండపం వద్ద ఉన్న వారు గమనించి వెంటనే బాలుడిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే మార్గమధ్యంలో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed