65ఏళ్ళ వృద్దురాలి ఘరానా మోసం (వీడియో)

by  |
65ఏళ్ళ వృద్దురాలి ఘరానా మోసం (వీడియో)
X

ఐఏస్ అధికారిణిని అంటూ వైద్యుల వద్ద నగదు వసూలు చేస్తున్న ఓ మహిళను కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మడి విజయలక్ష్మి(65) అనే మహిళ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి సుజాత రావు పేరు చెప్పి… తాను తిరుపతి వెంకన్న దర్శనానికి వెళుతున్నానని.. డాక్టర్ పేరు మీద తిరుపతిలో గరుడ పూజ చేయిస్తానని రూ.3,500 నగదు వసూలు చేయడానికి ప్రయత్నించింది.

ఈ నెల 8వ తేదీన హనుమాన్ జంక్షన్ లోని సీతా మహాలక్ష్మి నర్శింగ్ హోమ్ కు వెళ్లి పూజ నిమిత్తం రూ.3500 ఇవ్వాలని కోరింది. ఆ ఆసుపత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణల కమిటీ సలహాదారు డాక్టర్ దుట్టా రామ చంద్రరావుది కావడంతో సిబ్బందికి అనుమానం వచ్చి దుట్టా తనయుడు రవి శంకర్ కు సమాచారం అందించారు. ఒరిజినల్ ఐఏఎస్ అధికారిణి సుజాత రావుకు ఫోన్ చేయగా తాను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పరాదు.

ఆయన ఆసుపత్రికి వచ్చేసరికి అనుమానం వచ్చిన మహిళ అక్కడ నుంచి ఉడాయించడంతో.. రవిశంకర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. గత రాత్రి నకిలీ ఐఏఎస్ విజయలక్ష్మి ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆమెను సోమవారం ఉదయం అరెస్టు చేశారు.

కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే నిందితురాలిని అరెస్టు చేయడంతో హనుమాన్ జంక్షన్ సి ఐ రమణ, ఎస్ ఐ మదీనా భాషా, ఇతర సిబ్బందిని డిఎస్పి అభినందించారు. ఆమె గతంలో కూడా ఐఏఎస్ అధికారిణి సుజాత రావు పేరు చెప్పి నందిగామ, హైదరాబాద్, విజయవాడ ఏరియాల్లో నగదు వసూలు చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.


Next Story

Most Viewed