భారత్ లో కొత్తగా 46,963 కరోనా పాజిటివ్ కేసులు

by vinod kumar |
భారత్ లో కొత్తగా 46,963 కరోనా పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్ డెస్క్:
భారత్ లో గత 24 గంటల్లో 46,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 470 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 81,84,082 కరోనా కేసులు నమోదు అవ్వగా… మొత్తం 1,22,111 మంది కరోనాతో మరణించారు. దేశంలో ప్రస్తుతం 5,70,458 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 58,684 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 74.91లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 91.54 శాతం ఉంది. కాగా కరోనా మరణాల రేటు 1.49 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed