- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఉమ్మడి నిజామాబాద్లో 43 పాజిటివ్ కేసులు
by vinod kumar |
X
దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అంతేగాకుండా కామారెడ్డి జిల్లాలో రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, విశ్వరూపం చూపిస్తుంది. ఆదివారం ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 33 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అదివారం 43 పాజిటివ్ కేసులు వచ్చాయని వైధ్యాధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 33 కేసులలో 12 కామారెడ్డి పట్టణం, బాన్సువాడ 7, పిట్లం 8, మద్నుర్ 2, మిగిలిన 4 కేసులు బిచ్కుంద, గాందారి, బిర్కుర్, మచారెడ్డిలలో వెలుగు చూశాయి. నిజామాబాద్ జిల్లాలో 54 షాంపిళ్ల రిపోర్టులో 10 పాజిటివ్ రాగా, ఒకరు కరోనాతో చనిపోయారు. 37 నెగిటివ్ రాగా కొత్తగా 14 శాంపిళ్ల ఫలితాలు రావాల్సింది. నిజామాబాద్ జిల్లాలో 240 పాజిటివ్ కేసులు అయ్యాయి.
Advertisement
Next Story