భ‌ద్రాద్రిలో మరో 3 పాజిటివ్ కేసులు

by vinod kumar |
భ‌ద్రాద్రిలో మరో 3 పాజిటివ్ కేసులు
X

దిశ‌, కొత్త‌గూడెం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పాత పాల్వంచ, పాల్వంచ మరియు కొత్తగూడెం పట్టణంలోని బాబు క్యాంపు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా వ్యాధి నిర్దారణ జరిగినట్లు ఆదివారం కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన కరోనా లక్షణాలు ఉన్న 10 మంది అనుమానిత వ్యక్తుల రక్త నమూనాలను వైద్యులు సేకరించారు. వ్యాధి నిర్దారణ పరీక్షల కోసం పంపగా ఈరోజు వచ్చిన నివేదికలో ఆ ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ సమాచారాన్ని జిల్లా పాలనాధికారికి అందించగా ఆయన అధికారికంగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed