TSలో కొత్తగా 205 పాజిటివ్ కేసులు..

by vinod kumar |
India corona cases
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,068కి చేరింది. ప్రస్తుతం 6,231 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,77,304 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 551 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1533కి చేరింది. అయితే దేశంలో కరోనా మరణాల శాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గిందని.. రివకరీ రేటు 95.8 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 97.27 శాతానికి పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed