మహబూబ్ నగర్‌లో మరో రెండు కరోనా కేసులు

by vinod kumar |
మహబూబ్ నగర్‌లో మరో రెండు కరోనా కేసులు
X

దిశ, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజువారీగా రెండంకెల కేసులు నమోదవుతుండటంతో తెలంగాణ ప్రజానీకం భయాందోళనకు గురువుతోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అమిస్తాపూర్‌లో మరో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.గతంలో ఇదే కుటుంబానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా, ప్రస్తుతం ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి ఈ వైరస్ సోకడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విషయం తెలుసుకున్న అధికారులు గ్రామం అంతటా హైడ్రో క్లోరిన్ పిచికారీ చేయించారు. ప్రస్తుతం రోగికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed