కరోనాతో 16 మంది ‘మహా’ పోలీసులు మృతి

by  |
కరోనాతో 16 మంది ‘మహా’ పోలీసులు మృతి
X

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 42 వేలకు చేరువవుతోంది. అయితే, ఈ మహమ్మారిపై పోరులో కీలక పాత్ర పోషించే పోలీసులూ ఈ వైరస్ బారినపడి మృతిచెందుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,666 మంది పోలీసు సిబ్బందికి కొవిడ్-19 సోకగా, వీరిలో ఇప్పటివరకు 16 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 1,177 మంది పోలీసులు చికిత్స పొందుతుండగా, 473 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రాజధాని ముంబయిలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.

Next Story