దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే.. ?

by vinod kumar |
దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే.. ?
X

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1,32,05,926ను చేరింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 794 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,68,436గా నమోదైంది. తాజాగా కరోనా నుంచి కోలుకుని , 77,567 డిశ్చార్జ్ అయ్యారు. కాగా దేశంలో ప్రస్తుతం 10,46,631 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed