జపాన్ సంస్థకు నోబెల్ బహుమతి

by M.Rajitha |
జపాన్ సంస్థకు నోబెల్ బహుమతి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల(Nobel Prizes 2024) గ్రహీతల వివరాలను స్వీడన్ లోని నోబెల్ బృందం విడుదల చేస్తోంది. తాజాగా శుక్రవారం శాంతి నోబెల్ పురస్కారాన్ని జపాన్ కు చెందిన 'నిహన్ హిడాంక్యో' సంస్థకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు విశేష కృషి చేసినందుకు గాను జపాన్ కు చెందిన నిహన్ హిడాంక్యో సంస్థ నోబెల్ 2024 బహుమతి అందుకోనుంది. స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రఖ్యాత నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. ఈ బహుమతులను నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న గ్రహీతలకు అందజేస్తారు. కాగా సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో వైద్య, భౌతిక, రసాయనశాస్త్ర, సాహిత్య రంగాలకు పురస్కార గ్రహీతలను ప్రకటించగా.. నేడు శాంతి బహుమతిని ప్రకటించారు. ఇక అర్థశాస్త్రంలో పురస్కార గ్రహీతలను అక్టోబర్ 14న ప్రకటిస్తారు.

Advertisement

Next Story