భారత్, చైనాలు వలసదారులను ద్వేషిస్తున్నాయి: బైడెన్ కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
భారత్, చైనాలు వలసదారులను ద్వేషిస్తున్నాయి: బైడెన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్, చైనా, జపాన్, రష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాలు వలసదారులను ద్వేషిస్తున్నాయని అందుకే వారి ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని అన్నారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణపై నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. భారత్ సహా పలు దేశాలు వలసదారులను అంగీకరించడం లేదని తెలిపారు. వలసదారులను స్వాగతిస్తున్నాం కాబట్టే యూఎస్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందని చెప్పారు. ‘చైనా ఆర్థికంగా వెనుకబడి ఉంది, జపాన్ సైతం ఈ విషయంలో ఎంతో ఇబ్బంది పడుతోంది. రష్యా, భారత్ లు ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. ఎందుకంటే ఈ దేశాలు విదేశీయులను ద్వేషిస్తున్నాయి. వలసదారులు తమ దేశానికి వెళ్లడం వారికి ఇష్టం లేదు’ అని వ్యాఖ్యానించారు. కానీ విదేశీయులే మమ్మల్ని బలపరిచారు’ అని చెప్పారు. ఇతర దేశాల కంటే తమ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి.

Next Story

Most Viewed