దుబాయ్ ప్రిన్సెస్ సంచలన ప్రకటన.. భర్తకు విడాకులంటూ ఇన్‌స్టాలో పోస్ట్

by Harish |
దుబాయ్ ప్రిన్సెస్ సంచలన ప్రకటన.. భర్తకు విడాకులంటూ ఇన్‌స్టాలో పోస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: దుబాయ్ యువరాణి షైఖా మహ్రా బిన్త్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని ఆమె నేరుగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బహిరంగంగా పోస్ట్ చేయడం గమనార్హం. దీంతో ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో, "ప్రియమైన భర్తకు, మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందుకు, నేను మన విడాకులను ప్రకటిస్తున్నాను, నేను మీకు విడాకులు ఇస్తున్నాను, నేను మీకు విడాకులు ఇస్తున్నాను, అండ్ నేను మీకు విడాకులు ఇస్తున్నాను.. జాగ్రత్త. మీ మాజీ భార్య" అంటూ ఖాతాలో రాశారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో జంట ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, వారి ప్రొఫైల్‌ల నుండి ఫోటోలన్నింటినీ తొలగించారు.

అయితే దీనిపై కొందరు నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని కొందరు ఊహించగా, మరికొందరు దుబాయ్ యువరాణి ఖాతా హ్యాక్ అయిందని అంటున్నారు. ఇంకా కొంతమంది యువరాణి ధైర్యంగా, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే షైకా మహ్రా దుబాయ్‌ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ కుమార్తె. ఆమె ఉన్నత విద్యావంతురాలు. యూకేలోని ఒక విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ సంబంధాలలో డిగ్రీ చేసింది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షేక్ మానాను మే 27, 2023న వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రెండు నెలల క్రితమే మొదటి సంతానం కలిగింది. 20 ఏళ్ల వయస్సులో ఉన్న యువరాణి షైఖా మహ్రాకి అనేక వ్యాపారాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed