Bus Accident: అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం, 37 మందికి తీవ్ర గాయాలు

by Maddikunta Saikiran |
Bus Accident: అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం, 37 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.శనివారం మిస్సిస్సిప్పిలో బస్సు అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్‌స్టేట్‌ రూట్‌ 20లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని మిస్సిస్సిప్పి హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు. కాగా జరిగిన ప్రమాదంపై వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

అయితే వారెన్ కౌంటీలోని బోవినా సమీపంలో బస్సు హైవేపై నుండి జారిపడి బోల్తా పడింది. టైరు పగిలిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతుల్లో ఆరేళ్ల బాలుడు, అతని 16 ఏళ్ల సోదరి కూడా ఉన్నట్లు వారెన్ కౌంటీ కన్వీనర్ డౌగ్ హస్కీ పేర్కొన్నారు. మిగిలిన వారిని గుర్తించేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే.. గాయపడ్డ 37 మంది ప్రయాణికులను విక్స్‌బర్గ్, జాక్స్‌లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed