- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
శరణార్థి శిభిరంపై మరోసారి ఇజ్రాయెల్ దాడి..21 మంది మృతి
by vinod kumar |
X
దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిని ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచ దేశాలన్ని ఖండించినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను ఆపడం లేదు. ఈ విధ్వంసాన్ని ఆపాలని యూఎన్ఓ హెచ్చరించిన కాసేపటికే రఫా నగరంలోని శరణార్థి శిభిరంపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 21 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు పౌర రక్షణ అధికారి మహ్మద్ అల్-ముగయ్యిర్ తెలిపారు. శరణార్థి శిబిరంలో తలదాచుకున్న ప్రజలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు వెల్లడించారు. 21 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు అనేక మంది క్షతగాత్రులైనట్టు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ట్యాంకులు రఫా నగరం మధ్యలో ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిఅత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. కాగా, రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ చేసిన దాడిలో 45 మంది మరణించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story