- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమెరికాలో బ్రిడ్జిపై నుంచి ఎగిరి చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు భారత మహిళలు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్కు చెందిన ముగ్గురు మహిళలు తమ ప్రాణాలు కోల్పోగా, ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. SUV కారు అతి వేగంగా ప్రయాణిస్తూ సౌత్ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలోని బ్రిడ్జ్ మీదకు రాగానే అదుపు తప్పి బ్రిడ్జి మీద నుంచి 20 అడుగుల పైకి ఎగిరి ఎదురుగా ఉన్న చెట్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందినటువంటి రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ మరణించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కారును స్పీడ్ లిమిట్ కంటే అతి వేగంగా నడపడంతో బ్రిడ్జి మీదకు రాగానే అది కంట్రోల్ తప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ఈ ఘటనలో మిగతా వాహనాల ప్రమేయం లేదని గ్రీన్విల్లే కౌంటీ కరోనర్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కారు 4-6 లేన్ల రోడ్డును దాటుకుని గాల్లోకి ఎగిరి చెట్టుపై ఇరుక్కుపోయింది. ఇంత పైకి ఎగరడం చాలా అరుదుగా జరుగుతుంది. కారు నుజ్జునుజ్జయింది, పరిసరాలను చూస్తే ప్రమాద సమయంలో కారు అత్యంత వేగంతో ప్రయాణిస్తుందని అర్థం అవుతుందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్నటువంటి క్రాష్ డిటెక్షన్ సిస్టమ్ అలర్ట్ అయి వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయగా వారు సౌత్ కరోలినాలోని స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ సహా అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.