ఆమె ఎందుకు చనిపోయిందంటే..?

by  |
ఆమె ఎందుకు చనిపోయిందంటే..?
X

దిశ, బాల్కోండ: అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా భీమ్‌‌గల్ మండలం పురాణి పేట్‌‌ గ్రామానికి చెందిన దర్ర శ్రీనివాస్‌‌ తో మెట్‌‌పల్లి పట్టణానికి చెందిన దర్ర లక్ష్మీకి 15 సంవత్సరాల క్రితం పెండ్లి జరిగింది. అత్త దర్ర గంగముత్త వేధించడంతో దర్ర లక్ష్మీ తీవ్ర మనస్తాపానికి లోనై గడ్డి మందు త్రాగింది. ఇది గమనించిన స్థానికులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి చరలించారు. పరిస్థితి విషయమించడంతో ఆమె అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. కాగా మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. మృతురాలి తల్లి మంతెన ముత్తెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీదర్‌‌ రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed