ఈతకి వెళ్లి తండ్రి, కొడుకు దుర్మరణం

by Disha Web Desk 11 |
ఈతకి వెళ్లి తండ్రి, కొడుకు దుర్మరణం
X

దిశ, ఆత్మకూరు(యం) : ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రి, కొడుకులు దుర్మరణం చెందిన విషాద సంఘటన మోటకొండూరు మండలం చాడ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆత్మకూరు మండలం రాయపల్లి గ్రామానికి తండ్రి బోడ నరేష్ (37) ఆత్మకూరు రాంనగర్ కాలనీలో నివాసం ఉంటూ మేస్త్రి పని చేస్తుండేవాడు. ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామమైన మండలంలోని రాయపల్లి గ్రామానికి వెళ్లి జీవనం సాగిస్తున్నారు.‌ శుక్రవారం చాడ గ్రామంలో ఒక పండగకు అతని బంధువుల ఇంటికి కొడుకు బోడ సాయి(10)తో కలిసి వెళ్లారు.

పిల్లలకు ఈత నేర్పించే క్రమంలో ప్రమాదవశాత్తు తండ్రీకొడుకులు మృతి చెందారు. వ్యవసాయ బావి వెలుపల ఉన్న మరో కుమారుడు కేకలు వేయడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే మృతి చెందారు. సంఘటన స్థలానికి పోలీసులు,ఫైర్ సిబ్బంది శవాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. కొడుకు మృతదేహాం‌ లభ్యమవగా, తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన బాలుడు ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తండ్రి కొడుకుల మృతితో రాయపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.



Next Story

Most Viewed