వదిన ముక్కు చెవులు కోసి, చేయి విరిచిన మరిది..

by Anukaran |
వదిన ముక్కు చెవులు కోసి, చేయి విరిచిన మరిది..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇదివరకే పెళ్లయి భర్తను కోల్పోయిన మహిళకు అత్తింటివారు రెండో సారి వివాహం చేయాలని ప్రయత్నించారు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తులైన వారు ఆమె ముక్కు, చెవులు కోశారు. అంతటితో ఆగకుండా ఆమె కుడిచేయిని కూడా విరిచారు.ఈ దాడిని అడ్డుకునేందుకు యత్నించిన బాధితురాలి తల్లికి కూడా గాయాలయ్యాయి. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మేర్ ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఆరేళ్ల కిందట వివాహం జరిగిన ఓ మహిళ భర్త ఏడాది కిందట మరణించారు. దాంతో ఇంట్లో ఓంటరిగా ఉంటున్న వదినకు ఆమె భర్త తమ్ముడు (మరిది) దగ్గర బంధువుతో పెళ్లి చేయాలని చూశారు. అందుకు ఆ వితంతువు నిరాకరించింది. అత్తింటివారు పలుమార్లు ఒత్తిడి చేయడంతో ఆమె అతని సోదరుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఈ పెళ్లి తన సోదరికి ఇష్టం లేదని అతను నేరుగా ఆమె అత్తింటివారికి తెగేసి చెప్పాడు.

దీంతో ఆగ్రహించిన అత్తింటివారు వితంతువుపై దాడికి యత్నించారు. మరిది సాయంతో వితంతువుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆమె ముక్కు, చెవులు కోసి, కుడిచేయి విరిచారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాధితురాలి తల్లి వారిని అడ్డుకోవాలని యత్నించింది. ఈ క్రమంలో ఆమె కూడా తీవ్రంగా గాయాల పాలైంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారి కాంత సింగ్ నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed