- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Rain Alert :ఏపీకి రెయిన్ అలర్ట్..వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు
దిశ,వెబ్డెస్క్:రెండు తెలుగు రాష్ట్రంలో ఇటీవల భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పంట పొలాలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఇళ్లలోకి వరద(Flood) నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గి..బురద పోతుందనుకుంటే వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో ఇప్పటికే వర్షాలు(Rains) తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో తాజాగా రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతోందని పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్(Andra Pradesh) పై ఈ అల్పపీడనం ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందన్నారు. ఈ రోజు(శుక్రవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కావున మరో మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.