జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Sumithra |
crime
X

దిశ, జోగులాంబ గద్వాల : గుర్తు తెలియని వాహనం ఢీకుని ఇద్దరు మృతి చెందగా, ఒక్కరికి తీవ్ర గాయాలైన ఘటన గురువారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సోంపురం గ్రామానికి చెందిన బోయ నర్సప్ప (43), తిమ్మప్ప (32), నర్సమ్మలు ముగ్గురు కలిసి ఈరోజు సాయంత్రం‌ ద్విచక్ర వాహనంపై నందిన్నె నుంచి సోంపురం గ్రామానికి వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే కుచినెర్ల, నందిన్నెల మధ్య గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొనడంతో బోయ నర్సప్ప, తిమ్మప్ప అక్కడికక్కడే మృతి చెందగా.. నర్సమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు కేటిదొడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలికి చేరుకుని గాయపడిన మహిళను గద్వాల ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story